తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం డిసెంబర్ 4 (తెలుగు వెలుగు ) ఆర్యవైశ్య పితామహుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు కొణిజేటి రోశయ్య మూడవ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో కొత్తగూడెం పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు దారా నగేష్ ఆధ్వర్యంలో రోశయ్య కు ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి పాండురంగారావు, పల్లపోతు శ్రీనివాసు,చుంచుపల్లి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వారణాసి సురేష్, కొదుమూరిసురేష్, నరేంద్రుల రుషికుమార్ ,కొయ్యడ నగేష్, కూరా ప్రసాద్ దారా కిరణ్ కుమార్, పసుమర్తి అనంతం, డి. ఎస్ ఎస్ వి ఎం కె బాబు, కొదుమూరి సత్యనారాయణ, తమ్మిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ