తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి సిద్దిపేటలో నిన్న న్యాయవాది అశోక్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు,తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కోర్టు లైబ్రరీ హాల్ నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణచట్టం లేకపోవడం మూలంగా న్యాయవాదులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.ఇంకా ఎంతమంది న్యాయవాదులపై దాడులు జరిగిన తర్వాత న్యాయవాదుల రక్షణ చట్టాన్ని చేస్తారని ప్రశ్నించారు??.రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న కీలక సమయంలో న్యాయవాదిపై కోర్టులో దాడి జరగడం హేయమన్నారు.న్యాయవాదిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.న్యాయవాదుల రక్షణ విషయంలో తెలంగాణ బార్ ఫెడరేషన్ వారు రేపటి నుండి చేపట్టనున్న నిరహార దీక్షలకు మద్దతు ఇస్తున్నామని,ఈదీక్షలు న్యాయవాదుల రక్షణ చట్టం అమలు అయ్యేవరకు కొనసాగించాలన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో న్యాయవాదులు అంబటి రమేష్,ఎర్రపాటి కృష్ణ,ఎన్.నరసింహ చారి,వడ్లకొండ హరిప్రసాద్,గంగిరెడ్డి కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ