తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పీకే ఓసి మక్ రిమూవల్ టెండర్ పనుల ఖాళీలలో సిఎండి ఎన్.బలరాం ఆదేశాలు అమలు చేయాలనీ కోరుతూ శనివారం నాడు పీకే ఓసి ప్రాజెక్టు ఇంజనీర్ జె. వీరభద్రుడుకి వినతి పత్రం అందజేసినట్లు మణుగూరు ఏరియా సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏరియా పీకే ఓసి మక్ రిమూవల్ టెండర్ గోదావరిఖనికి చెందిన కాంట్రాక్టర్ కి టెండర్ వచ్చిందని స్థానికుడు ఇందులో సూపర్వైజర్ పనులు నిర్వహిస్తున్నాడని రోజుకి 30 మంది కాంట్రాక్ట్ కార్మికుల మ్యాన్ పవర్ సప్లై చేసే టెండర్ మొదటినుండి ఈ టెండర్ కాంట్రాక్టర్ల స్వార్థపూరిత వ్యవహారాలతో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉందనీ పైసలు పెట్టు పనిపట్టు కార్యక్రమం నీరాఘాటంగా కొనసాగిందనీ అన్నారు. గతంలో ఆరోపణలు కూడా వచ్చాయని రోజుకి 30 మస్టర్లకు గాను వారాంతపు పని కావడంతో రిలీవర్లతో కలిపి 40 మంది పని చేస్తున్నారనీ అయితే ఖాళీలలో కొత్త టెండర్లలో తప్పనిసరిగా సింగరేణి భూ నిర్వాసితులను మాత్రమే పనిలోకి పెట్టుకోవాలని సింగరేణి సి ఎండి బలరాం ఆదేశాలు ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా అమలు కావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా బిజీగా ఉండి చిన్న విషయం కదా అని పెద్దగా పట్టించుకోరనీ ఇదే అవకాశం గా పై అధికారుల ఆదేశాలు అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా పీకే ఓసి యాజమాన్యం స్పందించి ఏ టెండర్ అయినా కావచ్చు ఏర్పడే ఖాళీలలో కొత్త టెండర్లలో తప్పనిసరిగా సింగరేణి భూ నిర్వాసితులకు మాత్రమే అవకాశం కల్పించాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ