తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : లైసెన్స్ లేనటువంటి డ్రైవన్ లను నియమించి విద్యార్థుల ప్రాణాలతో చాలగటం ఆడుతున్న ప్రవేట్ విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా ఆర్టీవో కి వినతి పత్రం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు బస్సు ఫిట్నెస్ లపై సమగ్ర విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ కోరారు. మంగళవారం ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆర్టీవో రాజశేఖర్ ను కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ పరిమితీ కంటే ఎక్కువ మొత్తంలో విద్యార్థుల్ని బస్సులో ఎక్కిస్తూ ప్రమాదాలకు గురి చేస్తున్నటువంటి విద్యాసంస్థలపై, లైసెన్సులు లేకుండా మైనర్ డ్రైవర్లను నియమించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటాలాడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల కళాశాలల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంవత్సరం పునఃప్రాంభం అయిన కూడా ఇంకా ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన మొత్తం 254 బడి బస్సులు ఉన్నాయినీ, ఫిట్నెస్ పూర్తి చేసుకున్నవి అందులో ఇప్పటి వరకు 156 బస్సులు మాత్రమే ఆర్టీఏ అధికారుల వద్ద ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నాయి, మిగిలిన 98 బస్సులు ఇంకా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉందినీ వీటిపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి బస్సుకు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పర్మిట్, మరియు కాలుష్య నియంత్రణ పత్రాలు ఉండాలినీ కానీ వాటిని కొని విద్య సంస్థలు నిబంధనలు పాటించడం లేదని అన్నారు. బస్సులో అగ్నిమాపక పరికరం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మరియు (అత్యవసర ద్వారం) సరిగ్గా పని చేసేవిధంగా తక్షణమే జిల్లా అధికారయంత్రగం తనిఖీలు చెప్పాటాలినీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఇనపల్లి పవన్ సాయి జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్ నాయకులు కళ్యాణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ