తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంలోని స్థానిక శేషగిరి భవన్ నందు శుక్రవారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నూతన కార్యదర్శి కంచర్ల జమలయ్య మాట్లాడుతూమాపై నమ్మకం ఉంచి పార్టీ పదవులు కట్టబెట్టిన అధిష్టానానికి కృతజ్ఞతలు పార్టీ ఎదుగుదలకు అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తామని చెప్పారు.గురువారం నాడు పట్టణ 27వ మహాసభలు పద్మశాలి భవన్ నందు ఘనంగా జరిగాయని చెప్పారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు , జిల్లా కార్యదర్శి సాబీర్ పాష లు పాల్గొని పార్టీ నిర్మాణం కార్యకర్తల శ్రేయస్సు,నియోజకవర్గ ప్రజల సమస్యలపై మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల చరిత్ర గలది అన్నారు. ఈ ప్రాంతంలో పార్టీ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా నూతన పట్టణ కమిటీ ని ఎనుకున్నారని అన్నారు.పట్టణ కార్యదర్శిగా కంచర్ల జమలయ్య, ప్రజా సంఘాల కన్వీనర్ గా గెద్దాడ నగేష్, పట్టణ సహాయ కార్యదర్శిలుగా మునిగడప వెంకటేశ్వర్లు, మాచర్ల శ్రీనివాస్, నేరెళ్ల శ్రీనివాస్, నేరెళ్ల రమేష్ లను ఎన్నుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యవర్గ సభ్యులు ఎండి యూసుఫ్, చారి, బోయిన విజయ్, ధర్మరాజు,వెంకటేశ్వర్లు, మర్రి గోపికృష్ణ,గుత్తుల శ్రీనివాస్, తూముల శ్రీనివాస్,పాటి మోహన్, మండల రాజు, బరిగెల భూపేష్, అజీజ్, కొచ్చర్ల రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ