తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆశావాహ అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ. డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించిన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య మాట్లాడుతు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొత్తగూడెంలో నిర్వహించామని,ప్రతి జడ్పిటిసి నియోజకవర్గానికి ముగ్గురు సభ్యులను నియోజకవర్గ కమిటీల ద్వారా ఎంపిక చేసి పంపించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ 10 సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు భరించి, ఎన్నో కష్టనష్టాలు ఎదురుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎంతో ఆశగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారిని, గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ముందుగా దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి అకాల మరణంపై చింతిస్తూ, 2 నిమిషాల మౌనం పాటించారు. వేదికపై ఉన్న నాయకులు మాట్లాడిన అనంతరం అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ మోతుకూరి ధర్మారావు, భద్రాద్రి జిల్లా గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, టీపీసీసీ సభ్యులు బాలశౌరి, ఏనుగుల అర్జునరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటదేవి ప్రసన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు అజ్మీరా సురేష్ నాయక్, గడిపల్లి కవిత, కొత్వాల్ శ్రీనివాస్, మండే వీర హనుమంత్ రావు, కోనేరు చిన్ని, యడవల్లి కృష్ణ, బిక్కసాని నాగేశ్వరావు,గడిపల్లి కవిత,INTUC నాయకులు జలీల్, మొహమ్మద్ ఖాన్, రామ్ లక్ష్మణ్, గద్దల రమేష్, నూకల రంగారావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ