Sunday, 19 April 2026 02:16:34 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

విద్యార్థుల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్యను అందించాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 22 August 2025 06:54 PM Views : 394

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం మణుగూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాల మరియు తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల మరియు వసతి గృహం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ తరగతి గదులు, భోజనశాల, వసతి గృహాలు, పాఠశాల పరిసరాలను సమగ్రంగా పరిశీలించారు. హాస్టల్ తనిఖీ సమయంలో విద్యార్థులతో ప్రత్యక్షంగా ముచ్చటించి, వసతి సౌకర్యాలు, పరిశుభ్రత, త్రాగునీరు, మంచం, దుప్పట్లు, స్నానాల గదులు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. తరగతి గదులను సందర్శించిన ఆయన, విద్యార్థుల చదువుపై ఆసక్తి, ఉపాధ్యాయుల బోధన నాణ్యత, అభ్యాస స్థాయి పై సమగ్ర సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని, ప్రభుత్వమందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉపాధ్యాయులు పాఠ్యబోధనతో పాటు పోటీ పరీక్షల శిక్షణను కూడా అందించాలని ఆయన గైడ్ చేశారు. భోజనశాల పరిశీలనలో, ఆహార పదార్థాల నిల్వ, వంటశాల శుభ్రత, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను కలెక్టర్ ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. తాజా పదార్థాలతోనే వంట చేయాలని, ఆహారం పోషకాహారంతోనూ, రుచికరంగానూ ఉండేలా జాగ్రత్త పడాలని సిబ్బందికి ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్యను అందించడంలో ఎలాంటి రాజీ పడకూడదు అని, వసతి, భోజనం, శుభ్రత, భద్రతపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి అని ఆదేశించారు. విద్యార్థులు పుస్తకాలతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ప్రతిభ కనబరచేలా అవకాశాలు కల్పించాలి అన్నారు. పాఠశాలల నెలకొన్న సమస్యలపై నివేదికలు అందించాలని తక్షణమే పరిష్కారం చూద్దామని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :