తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 21 (తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు మెగా జాబ్ మేళా ను విజయవంతం చేయాలని మండల స్థాయి అధికారులతో కలిసి ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు.అనంతరం మెగాజాబ్ మేళ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హైదరాబాద్ కు ఐటి రంగాని తీసుకొచ్చి గొప్ప ఉద్యోగ అవకాశలు కల్పించారాని కొనియాడారు, అదేవిధంగా వైరా నియోజకవర్గ కేంద్రం లో ఈ నెల 24 వ తేదీన ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు, మెగా జాబ్ మేళాను విస్తృత ప్రచారం చేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 80 కంపెనీల అధిపతులతో మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందన్నారు ,ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని దీనికి ముఖ్యంగా అధికార యంత్రాంగం మొత్తం ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలని అక్కడున్న నిరుద్యోగ యువతీ యువకులకు అవగాహన కల్పించే విధంగా కార్యచరణ తీసుకోవాలని అధికారులకు సూచించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ళ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగీలాల్, తాసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఎస్సై రవి,మండల స్థాయి అధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ