తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా జి.యం. ఎం. షాలేం రాజు ఆదేశాల మేరకు కారుణ్య నియామకాల కొరకు పద్మావతి ఖని మైన్ నందు విధులు నిర్వహిస్తూ మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన/ మరణించిన ఉద్యోగుల వారసులు 9 మందికి పద్మావతి ఖని ఏజెంట్ కార్యాలయంలో ముఖాముఖీ (కౌన్సిలింగ్) వారి కుటుంబ సభ్యుల మరియు సాక్షుల సమక్షంలో నిర్వహించి అన్నివివరాలు నమోదు చేసి కౌన్సిలింగ్ పూర్తి అయిన తరువాత అందరిని వైద్యపరీక్షల కొరకు పంపించి కంపెనీ నియమ నిబంధనలు అనుసరించి వారికి నియామక ఉత్తర్వులు అందజేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో పద్మావతి ఖని మైన్ ఏజెంట్ బి.రవీందర్, డి.జి.యం. (పర్సనల్) గామలపాటి వెంకట మోహన్ రావు, మైన్ మేనేజర్ ఎం.వి.ఎన్ శ్యాం ప్రసాద్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మజ్జి మురళి, మైన్ సంక్షేమ అధికారి షేక్ షకీల్, సంబంధిత క్లర్క్ కొత్తపల్లి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ