తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : Arrive alive-2026 లో భాగంగా రెండవ రోజు రోడ్డు భద్రతా ప్రతిజ్ఞలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్,ఎస్పీ రోహిత్ రాజు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న Arrive-alive-2026 రెండవ రోజున కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు గల అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టణ ప్రజలు,ప్రముఖులు,ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు రోడ్డు భద్రతా ప్రతిజ్ఞను చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్,ఎస్పీ రోహిత్ రాజు లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితోపాటు అడిషనల్ కలెక్టర్ వేణు గోపాల్,అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) విద్యాచందన,కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత,మేయర్ మూడ్ గణేష్,ఆర్డిఓ మధు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు,పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.ముందుగా జిల్లా కలెక్టర్ ఎస్పీలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకొని కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను సులభంగా నియంత్రించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ బాధ్యతగా మెలగాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ తమ భార్యా,పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఇంటి నుండి బయటకు రాగానే హెల్మెట్ ధరించడం,సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో పాటు ఇతర ట్రాఫిక్ నియమాలను కూడా కచ్చితంగా పాటించాలని సూచించారు.విధులలో రోడ్లపై పోలీసులు ఉన్నా లేకపోయినా భాద్యతగా రూల్స్ పాటించి భాద్యత గల పౌరులుగా మెలగాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ