తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఇల్లందు : ఇల్లందులో బుధవారం జరిగిన ప్రకృతి ఆరోగ్య మహాసభలలో, కొత్త గూడానికి చెందిన ప్రకృతి ఆశ్రమం కో-ఆర్డినేటర్, నాచురోపతి ప్రాక్టీషనర్ సుగుణారావు -శోభారాణి దంపతులను అతిధులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఆయన ఆల్టర్నేటివ్ తెరపిస్టుగా, ప్రకృతి వైద్యం, ఆక్యుపంచర్ సైన్స్, ఆక్యుప్రెషర్ థెరపీ, ఖైరో ప్రాక్టీస్ (మ ర్మకళ) ఆయుర్వేదం మొదలైన వైద్య విధానాల ద్వారా అనేక జబ్బులను తగ్గిస్తుండట మే కాకుండా, వైద్య విధానాలను సాధారణ ప్రజల వరకు చేరవేస్తున్నాడటంతో వారిని సన్మానించారు. సన్మానించిన వారిలో ప్రముఖ ప్రకృతి కవి డాక్టర్ జయరాజు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, డి.ఎస్.పి చంద్రభాను, మాజీ మున్సిపల్ చైర్మన్ డివి, నవభూమి బ్యూరో చీఫ్ తుమ్మలపల్లి ప్రసాద్, స్థానిక వైద్యులు రవికుమార్, ప్రముఖ ఆక్యుపంచర్ వైద్యులు అనిల్ కుమార్, అనువంశిక వైద్యులు డాక్టర్ లక్ష్మణ స్వామి, సభ నిర్వాహకులు లింగాల వెంకన్న, బొమ్మేర ముత్యం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సుగుణారావు మాట్లాడుతూ సన్మానించిన ఇల్లందు సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం వారికి, అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో ఆల్టర్నేటివ్ థెరపీస్ వ్యాప్తిలో మరింత బాధ్యతగా ఉంటానన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ