తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు కార్యాలయం నవభారత్ పాల్వంచ.... జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఈ రోజు జిల్లా పార్మసీ అధికారులు మరియు నర్సింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఫార్మసీ అధికారులకు ఈ ఔషదీ పోర్టల్ నందు కావాల్సిన మందుల ఇండెంట్ ఎప్పటి కప్పుడు అప్డేట్ చేసుకోవాలని, కాలం చెల్లిన మందుల వివరాలు రిజిస్టర్ పెట్టుకోవాలని అని, కాలం చెల్లుతున్న మందులను గుర్తించి త్వరగా ఖర్చు చెయ్యాలని మరియు అన్ని ఆరోగ్య కేద్రాలయందు మందుల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. నర్సింగ్ అధికారుల సమీక్ష నందు OP మరియు ఇన్ పేషెంట్ రోగులతో ప్రేమతో మాట్లాడుతూ చికిత్స అందించాలని, జీరో డోస్ ఇమ్మ్యూనైజషన్ అప్పుడే పుట్టిన పిల్లలకు ఖచ్చితంగా అందించాలని, UPHC Ramavaram నందు నర్సింగ్ అధికారి శంకరమ్మ అందిస్తున్న సేవలను కొనియాడుతూ, అలాగే అందరు పని చెయ్యాలని మరియు దవాఖనలో ప్రసూతిల సంఖ్యను పెంచాలని, ఆదేశాలు ఇచ్చారు. తదుపరి జిల్లా వాక్సిన్ స్టోర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి సంతృప్తి తెలియజేస్తూ అన్ని ఆరోగ్య కేంద్రాలందు వాక్సిన్ కొరత లేకుండా చూడాలి అని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం నందు డాక్టర్ తేజస్వి PO CHI , నాగభూషణం CHO, మోహన్ DPMO పార్మసీ మరియు నర్సింగ్ అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ