తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టి యు సి ఐ ఆధ్వర్యంలో 140వ మే డే ను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం మండల పరిధిలోని వెంగన్నపాలెం గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి మేడే పోస్టర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు మాట్లాడుతూ చికాగో పోరాట అమరవీరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న, ఎన్నో ఉద్యమాలతో కొట్లాడి సాధించుకున్న కార్మిక హక్కులను ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కి కార్మికులను కట్టు బానిసలుగా చేసే ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ వెలుగులోనే కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా అమలు చేస్తుందని అన్నారు చికాగో అమరవీరుల స్ఫూర్తితో మేడే రోజున ఎనిమిది గంటల పని దినం సాధించుకుంటే ఇప్పుడు ఉన్న నరహంతక బిజెపి ప్రభుత్వం 12 గంటల పని విధానం తీసుకురావాలని కుటీల ప్రయత్నాలు చేస్తుందని దీన్ని కార్మిక వర్గం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చి, పని గంటల పెంపు, సమ్మె హక్కును కాలరాస్తూ అతి తక్కువ వేతనాలతో కార్మిక వర్గానికి పని లేకుండా చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తుందని గోపాలరావు దుయ్యబట్టారు . యూనియన్ పెట్టే హక్కు లేకుండా ప్రశ్నించే హక్కు లేకుండా కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుందని దీని వెలుగులోనే 140 మే డే ను కార్మిక వర్గం స్ఫూర్తిగా తీసుకొని మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, నియంతలా వ్యవహరిస్తున్నమోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం ఒక తాటిపైకి వచ్చి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని గోపాలరావు కోరారు. రాబోయే రోజుల్లో కార్మిక వర్గం పై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా జరుగు ఆందోళన కార్యక్రమాల్లో కార్మిక వర్గం ముందు వరుసలో ఉండాలని ఈ సందర్భంగా కోరారు. దేశంలో ప్రశాంతమైన వాతావరణంలో కలిసిమెలిసి బతుకుతున్న కార్మిక వర్గంపై ప్రజలపై దేశ ప్రజలను కుల మతాల పేరుతో విభజించి మనుషుల మధ్య తగాదాల సృష్టించి మతాల పేరుతో ప్రజలను విభజించాలనే కుటీల ప్రయత్నాలు చేస్తుందని దీన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు సంఘటితమై వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని వారన్నారు. మే డే ను కార్మిక దినోత్సవం గా వాడవాడల కార్మిక వర్గం అంత జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో వినోద్, నాగేష్,మధు కనకమ్మ, అరుణ, లలిత, చందు, నాగయ్య, శ్రేదేవి, నరేష్, పద్మ భవానీ, నరసింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ