Sunday, 19 April 2026 05:56:54 PM
# మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె.

ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పనులు త్వరితగతిన చేపట్టాలి.. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 03 April 2025 04:52 PM Views : 410

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వ్యవసాయ భూములలో ఫామ్ పాండ్ నిర్మాణం రైతుల ఆర్థిక అభివృద్ధికి నాంది అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలో పురోగతిలో ఉన్న ఉపాధి హామీ పనులు, జల్ సంచెయ్ జెన్ భాగీదారి, నర్సరీలలో మొక్కల పెంపకం, త్రాగునీటి పైపుల మరమ్మత్తు పనులు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, అంగన్వాడీలలో విద్యుదీకరణ తదితర అంశాలపై గురువారం ఐ డి ఓ సి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం ఉపాధి హామీ లక్ష్యాలను సాధించినందుకు అధికారులను అభినందించారు. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఉపాధి హామీ పథకం లక్ష్యాలను త్వరితగతిన పూర్తయ్యాలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో అన్ని వ్యవసాయ భూముల్లో ఫాం పాండ్ నిర్మాణాలను చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 52 వేల బోర్లు వ్యవసాయ భూముల్లో ఉన్నాయని, కనీసం 50 వేల ఫామ్ పౌండ్ నిర్మాణాలను చేపట్టాలన్నారు. బోర్ ఉన్న ప్రతి వ్యవసాయ భూమిలో కచ్చితంగా ఫాం పౌండ్ ఉండాలన్నారు. ఫాం పాండు నిర్మాణం ద్వారా చేపల పెంపకం, అజోల్ల పెంపకం వంటి వాటిని సాగు చేయడం ద్వారా రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అన్నారు. మన జిల్లాలో చేపడుతున్న ఫాం పౌండ్ త్రవ్వకాలు, మునగ సాగు వంటి వాటిని ఆదర్శంగా ఇతర జిల్లాలు తీసుకుని ముందుకు సాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఉపాధి హామీ పథకం కూలీల అందరికీ జీవనజ్యోతి మరియు జీవన సురక్ష పథకం గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ప్రతి ఒక్కరికి ఆ పథకాల యొక్క ప్రయోజనాలు వివరించాలని అధికారులను ఆదేశించారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందువలన ఉపాధి హామీ కూలీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి కూలీలకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులు వద్ద త్రాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు, టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. జల్ సంచెయ్ , జెన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలు మరియు ప్రభుత్వ స్థలాలో ఎన్ని ఇంకుడు గుంతలు త్రవ్వడానికి అవకాశం ఉందో సోమవారం లోగా నివేదికలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులతో కలిసి ఉద్దేశించిన పరిమాణంలో ఇంకుడు గుంతల నిర్మాణాలు సమన్వయంతో చేపట్టాలన్నారు. జిల్లాలో త్రవ్విన ఇంకుడు గుంతల చుట్టూ గోరింటాకు మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకుడు గుంతలు మరియు ఫామ్ పౌండ్ వివరాలను గ్రామ మండల మరియు జిల్లా స్థాయిలో నివేదికల సమర్పించాలని ఆదేశించారు. ఇంకుడు గుంతలు నిర్మాణాల్లో జిల్లాలోని యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలన్నారు. ఏ గ్రామంలో అయితే ఎక్కువ ఇంకుడు గుంతలు నిర్మాణం చేపడతారు వారిని ఆగస్టు 15 న 5 గురికి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అని తెలిపారు. నిర్మాణం చేపట్టిన ప్రతి ఇంకుడు గుంత వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి అవార్డు రావాలని అందులో మన జిల్లా అగ్రస్థానంలో నిలవడమే ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. మే 31 వ తేదీ నాటికి అన్ని వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని ఆయన తెలిపారు. స్వచ్ఛభారత్ లో భాగంగా మంజూరైనటువంటి మరుగుదొడ్ల నిర్మాణం వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని నర్సరీలో ఖాళీగా ఉన్న బ్యాగులలో మందారం, మునగ మొక్కలను పెంపకం చేపట్టాలన్నారు. మునగ సాగులో మన జిల్లా తమిళనాడును మించాలన్నారు. జిల్లాలో త్రాగునీటి సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న పైప్ లైన్ల మరమ్మత్తుల వివరాలను ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని, పనులు పూర్తి చేయడంలో నాణ్యత పాటించాలని, ఇంకా ఎక్కడైనా త్రాగునీటికి అవసరమైన పైప్ లైన్ ల వివరాలను అందించాలన్నారు. సోమవారంలోగా అందించాలన్నారు.ఏప్రిల్ నెల ఆఖరి లోపు అన్ని పనులను పూర్తి చేయాలని, మారుమూల ప్రాంతాలలోని ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా జరిగేలా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జనవరి 26న మంజూరైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పనులను త్వరిత చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మిగిలిన గ్రామాలలో కూడా లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పర్యటించి జాబితా తయారు చేయాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ఉపయోగించుకొని సంపద పెరిగే విధంగా పరిశ్రమలు స్థాపించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి మండల పరిషత్ కార్యాలయాల్లో రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని, దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని, పథకం కోసం దరఖాస్తు కు వచ్చిన వారి వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించి దరఖాస్తులను పూర్తి చేయడానికి ఒక అధికారిని అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 14 వరకు గడువు ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని, అన్ని అంగన్వాడి కేంద్రాల్లో లైట్లు, ఫ్యాన్లు ఉండే విధంగా పనులను చేపట్టాలన్నారు. చేపట్టిన పనుల వివరాలను ఫోటోలు మరియు నివేదికలు సమర్పించాలని రెండు వారాల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీ పథకం అమలులో భాగంగా ప్రతి మండలంలో ఒకచోట స్థానిక శాసనసభ్యులచే సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పెన్షన్ దారుడు ఎవరైనా చనిపోతే వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తూ వెంటనే పెన్షన్ దారుని భార్య కు పెన్షన్ మంజూరు అయ్యే విధంగా వితంతు పెన్షన్ లేదా 57 సంవత్సరాలు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్ మంజూరయ్యే విధంగా ఆన్లైన్లో అప్డేట్ చేయడం ద్వారా వెంటనే భార్యకు పెన్షన్ మంజూరు అవుతుందని కాబట్టి ఎంపీడీవోలు అప్డేషన్ కచ్చితంగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సిపిఓ సంజీవరావు, హౌసింగ్ పీడీ శంకర్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి,మిషన్ భగీరథ ఈఈ లు నలిని, తిరుమలేష్ ,ఎస్సీ సంక్షేమ అధికారి అనసూయ, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :