తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జాతీయ నూతన విద్యా విధానం రద్దుకై విద్యార్థులు ఉద్యమించాలని, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ అన్నారు. అనంతరం అయన మాట్లాడుతూ నేడు దేశంలో నూతన విద్యావిధానం పేరుతో యూనివర్శీటీల స్వయం ప్రతిపత్తి దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. యూనివర్శీటిలను మూడు, నాలుగు. రకాలుగా విభజన చేసి విద్యను కార్పోరేటీకరణ, ప్రైవేటీకరణ, చేస్తుందని ఆయన అన్నారు. ఈ విధానాలు ప్రభుత్వం విద్య వ్యవస్థను ధ్వంసం చేయడానికి తీసుకుంటున్న చర్యలని అయన ఆరోపించారు. కనీసం 10 శాతం బడ్జెట్ కేటాయింపులు చేయకుండా, జిడిపిలో 6 శాతం నిధులు కేటాయించకుండా ఎలా నూతన విద్యావిధానం అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. నూతన విద్యావిధానం, విశ్వవిద్యాలయాల ఫండ్ కట్స్, ఫెలోషిప్స్ ఇవ్వకపోవడం, ఖాళీలు భర్తీ చేయకుండా ఉండడం, యూనివర్శీటీలలో ప్రజాస్వామ్య వాతావరణం లేకుండా చేయడంపై ఉద్యమించాలని ఆయన కోరారు. నూతన జాతీయ విద్యా విధానంలో ఎక్కడ కూడా ఉచిత విద్య అనే పదాన్ని కూడా పొందుపరచకుండా నూతన జాతీయ విద్యా విధానంలో పేదవారికి ఉచిత విద్యా లేనట్టేనని అయన పేర్కొన్నారు. తక్షణమే జాతీయ నూతన విద్యా విధానాన్ని ఉపసహరించుకోవాలని లేనియెడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గుగులోత్ వంశీ హెచ్చరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ