తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దమ్మపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వరస్తూ గుండెపోటుతో ఇటీవల మరణించిన ఏఎస్సై చీమా కుటుంబానికి మరియు చంద్రుగొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ గుండెపోటు కారణంగా మరణించిన ఏఎస్సై శ్రీనివాసరావు కుటుంబాలకు ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తన కార్యాలయంలో చెక్కుల రూపంలో భద్రతా సంక్షేమ నిధి నుండి చేయూత ఫండ్ ద్వారా ఒక్కొక్కరికి 1,00,000/-(లక్ష రూపాయల) నగదును అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో నిరంతరం విధులు నిర్వర్తించే అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మరణించిన పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం తరఫున మరణించిన పోలీసుల కుటుంబాలకు అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యాలయ సూపరింటెండెంట్ సత్యవతి మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ