Friday, 19 June 2026 05:53:48 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

మునగ తోటల నిర్వహణపై రైతులకు కీలక సూచనలు – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 25 June 2025 01:10 PM Views : 790

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో నవంబర్-డిసెంబర్ మాసాల్లో నాటిన మునగ తోటలు ప్రస్తుతం పూత మరియు కాయల దశలో ఉండటంతో, ఈ దశలో సరైన పర్యవేక్షణ లేకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ రైతులకు సూచించారు. పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు రైతులు తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయ శాఖ నిపుణులతో కలిసి కలెక్టర్ చర్చించారు.ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు కీలక సూచనలు చేశారు:నీటి నిల్వ నివారణ: వర్షాకాలంలో తోటల్లో నీరు నిలవకుండా చూడాలి. మీరు నిల్వ ఉంటే మొక్కల వేర్లు కుళ్ళిపోవడం, తెగుళ్లు వ్యాపించడం జరుగుతుంది కాబట్టి నిల్వకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికిగాను ఉపాధి హామీ పథకం కింద 12x12 మీటర్ల నీటి కుంటలు తవ్వించుకోవాలి. లేకపోతే రైతులు స్వయంగా చిన్న గుంటలు (3x3 మీటర్లు) తవ్వి నీరు పారేలా చర్యలు తీసుకోవాలి అన్నారు.తేమ నిర్వహణ: వర్షాల మధ్య ఎండలు పడటం వల్ల తోటలో తేమ లోపించే అవకాశం ఉంది. కాయల దశలో తేమను నిలుపుకోవడం అత్యవసరం. తేమ/ నీరు సరైన స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి . ఎరువుల వినియోగం: పుష్పోత్పత్తి మరియు కాయల అభివృద్ధి దశలో మొక్కలకు పశువుల ఎరువు (5-10 కేజీలు), యూరియా (100 గ్రా), పొటాష్ (50 గ్రా) ఇవ్వాలి. లేదా డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువులు 19:19:19 లేదా 13:0:45 వారానికి ఒకసారి ఇవ్వాలని సూచించారు.కలుపు నివారణ: పోషకాలు కలుపులకు పోకుండా, ప్రతి వారం తోట పరిశీలించి కలుపును తొలగించాలి.పురుగు నియంత్రణ: ఆకులను తినే గొంగళి పురుగుల నియంత్రణకు ( 15 రోజులకు ఒకసారి ) వేప కషాయం పిచికారి చేయాలి. అవసరమైతే నిపుణుల సూచనల మేరకు Proclaim, Delegate, Coragen వంటివి వినియోగించాలి.తెగుళ్ల నివారణ: ఆకుమచ్చ తెగుళ్ల నియంత్రణకు వేప నూనె 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. లేదా Carbendazim, Mancozeb వంటి మందులు నిపుణుల సలహాతో వాడాలని సూచించారు .రైతులు ఈ సూచనలు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు మరిన్ని వివరాల కోసం మండల వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు అని తెలిపారు.ప్రతి మండల వ్యవసాయ అధికారి (AO), విస్తరణ అధికారి (AEO) గ్రామస్థాయిలో ఈ సూచనలను విస్తృతంగా ప్రచారం చేయాలని, రైతులకు అవగాహన కల్పించేందుకు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతుల సందేహాల నివృత్తికి అధికారుల అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :