తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 30 తెలుగు వెలుగు )జూలూరుపాడు లో అద్దె ఇంట్లో నివసిస్తున్న ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.వివరాల్లోకి వెళితే రామవరం సుభాష్ చంద్ర బోస్ నగర్ కాలనీకి చెందిన, రాజేశ్వరి 34 సంవత్సరాలను, రఘునాథపాలెం మండలం, రాములు తండా కు చెందిన బానోతు రానా ప్రతాప్ తండ్రి పేరు: చంద్రం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కు ఇచ్చి ,సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిపించినారు. పెళ్లి సమయంలో 40 లక్షల రూపాయల నగదు తో పాటు, 35 తులాల బంగారం మరో నాలుగు లక్షల రూపాయల విలువచేసే ఇతర వస్తువులు కట్నంగా ఇచ్చినామని, ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానముగా కలరని, అయితే పెళ్లయిన తర్వాత వీరి సంసార జీవితం సజావుగానే సాగిందని, ఆ తరువాత రాజేశ్వరిను తన భర్త బానోతు రానా ప్రతాప్, అత్త పుష్పారాణి, మామ చంద్రం, బావ మహేష్ SI లు కలిసి మానసికంగా, శారీరకంగా వేధిస్తూ, తాము చెప్పిన విధంగా నడుచుకోవాలని, అనుమానం అనే నెపముతో అక్రమ సంబంధాలు అంటగట్టి, తాము చెప్పిన ఇంట్లోనే ఉంటూ, సంసారం చేసుకోవాలని లేనిచో, ఆత్మహత్య చేసుకోవాలని, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం వలన, ఒత్తిడి తట్టుకోలేక అవమానభారంతో ది 25. 6.2025న జూలూరుపాడు లో గల కిరాయి ఇంట్లో రాత్రి 11:30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి, తాను మందు తాగానని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన రాజేశ్వరిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించినారని అచటి నుండి డాక్టర్ల సలహా మేరకు ఖమ్మం కిమ్స్ హాస్పిటల్కు చికిత్స కొరకు తీసుకెళ్లారని, అటు తరువాత రాజేశ్వరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కిమ్స్ హాస్పిటల్ నుండి హైదరాబాదు నందు గల యశోద హాస్పిటల్ కు తీసుకువెళ్లి చికిత్స చేయిస్తుండగా, నిన్న అనగా తేదీ 29. 6. 2025న రాత్రి అందాజా 11:25 గంటల సమయంలో మరణించినట్లుగా డాక్టర్లు దృవీకరించినారని, తన కుమార్తె రాజేశ్వరిను ఆమె భర్త రాణా ప్రతాప్, అత్త పుష్పావతి, మామ చంద్రం, బావ మహేష్ ఎస్సైలు మానసికంగా శారీరకంగా వేధించి, ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి, తన కూతురు చావుకి కారకులైన పై నలుగురిపై చర్య కొరకు మృతురాలి తండ్రి కేళోతు సోమ్లా, తండ్రి పేరు దేవుల, 60 సంవత్సరములు, సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరం పట్టణం కొత్తగూడెం ఫిర్యాదు ఇవ్వగా జూలూరుపాడు ఎస్సై రవి కేసు నమోదు చేయనైనది.
Admin
తెలుగు వెలుగు టీవీ