తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 28 (తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండలం గ్రామపంచాయతీ కార్మికుల టోకెన్ సమ్మెలో భాగంగా జూలూరుపాడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు . ఈ సందర్భంగా AITUC జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య, జిల్లా జేఏసీ నాయకులు, ఏదులాపురం గోపాలరావు, ఎండి యూసుఫ్, యాసా నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరపాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు,గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలి. వేతనాలకు ప్రభుత్వం ప్రత్మేక బడ్జెట్ కేటాయించాలి. గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలి .2వ పిఆర్ సి పరిధిలోకి గ్రామ పంచాయితీ సిబ్బందిని తీసుకురావాలి. జివో నెం:60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారిగా చెల్లించాలి జీవో నెం.51ని సవరించాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి. పాత కేటగిరీలన్నింటినీ కొనసాగించాలి. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియమించాలి. అర్హులైన సిబ్బందికి ప్రమోషన్ల న్లు కల్పించాలి పంచాయతీ సిబ్బందినందరికి ఉద్యోగ భద్రత కల్పించాలి. రీటైర్మెంట్ బెనిఫిట్ రూ. 5 లక్షలు చెల్లించాలి. ఇన్సురెన్సు, ఇఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. కాంగ్రేస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. పంచాయతీ సిబ్బందినందరిని పర్మినేంట్ చేయాలి.వేతనాలు పెంచాలి. ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేసి నేరుగా వారికి కూడ వేతనాలు చెలించాలి. పంచాయతీల అవసరాల ప్రతిపాధికన కార్మికుల సంఖ్యను పెంచాలి.కార్మికులందరికి ఇందీరమ్మ ఇండ్లు, ఇండ్ల సథలాలు కేటాయించాలి .చనిపోయిన ఆనారోగ్యానికి గురైన కార్మికుల కుటుంబాల సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలనీ డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ