తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పులిపాటి ప్రసాద్ కాలేజీల్లో అర్హత లేని వారితో తరగతులు నిర్వహిస్తున్నారు అని నర్సింగ్ కాలేజీకి మాత్రమే ప్రత్యేక భవనం ఉండగా, వొకేషనల్, పారామెడికల్, డిగ్రీ తరగతులు ఒకే భవనంలో నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని సేవాలాల్ బంజారా సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బోడ శ్రీనివాస్ అన్నారు. ప్రిన్సిపల్కు అర్హతలు లేకపోవడం, ఆయనపై పోలీస్ కేసు ఉన్నప్పటికీ ప్రిన్సిపల్ గా కొనసాగించడం వంటి అంశాలను వారు ప్రశ్నించారు. గతంలో ఒక ఉపాధ్యాయుడు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూడా ఆ సంస్థలో పరిస్థితుల తీవ్రతను సూచిస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా పులిపాటి ప్రసాద్ కాలేజీలపై డి ఎం హెచ్ ఓ సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లౌడియా ప్రసాద్ నాయక్, భూక్య కృష్ణమూర్తి నాయక్ పాల్గొనడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ