Monday, 20 April 2026 01:53:25 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మంజూరు పట్ల హర్షం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు : జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్

Date : 09 April 2025 05:01 PM Views : 377

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మైనింగ్ ను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం 300 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు మంజూరు చేయడంలో విశేష కృషి చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ కృతజ్ఞతలు తెలిపారు.బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కామేష్ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాకు మంజూరు కావడం హర్షనీయమన్నారు.రాష్ట్ర విద్యార్థులు ఇన్నాళ్లు ఎర్త్ సైన్సెస్ కోర్సు చదవాలంటే సెంట్రల్ యూనివర్సిటీలకు వెళ్లాల్సి వచ్చేదని,కొత్తగూడెంలోనే ఈ కోర్సులు అందుబాటులోకి రావడంతో విద్యార్థుల ఇక్కట్లు తీరనున్నాయన్నారు.ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాకు మంజూరు కావడంతో అత్యున్నత ప్రమాణాలతో వేలాదిమందికి విద్య,ఉపాధి అవకాశాలు లభించనున్నాయని,వేల సంఖ్యలో యువ శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచే దేశ భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అడ్మిషన్లతో జిల్లాకు జాతీయస్థాయిలో పేరు రాబోతుందని విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తుతోపాటు కొత్తగూడెం ప్రాంతం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తుమ్మల గారు భవిష్యత్తులో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇదే విధంగా పాటుపడాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జున రావు,జిల్లా ఉపాధ్యక్షుడు మాలోత్ వీరు నాయక్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,రాయరాకుల శివ శంకర్,పూణెం మురళి తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :