Monday, 20 April 2026 01:38:58 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

చేతికొచ్చిన పంటలను ధ్వంసం చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి : సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్

Date : 02 September 2025 06:05 PM Views : 319

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం 02 Sep తెలుగు వెలుగు టీవీ : గత 20 ఏళ్లకు పైగా సాగులో ఉన్న భూములను ఈ సంవత్సరం ఫారెస్ట్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైతులకు చెప్పకుండా జంక్షన్ చేయడానికి తీవ్రంగా ఖండించాలని ధ్వంసం చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం స్థానిక ఐ ఎఫ్ టి యు కార్యాలయం నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఫారెస్ట్ అధికారులు చర్ల దుమ్ముగూడెం పాల్వంచ జూలూరుపాడు మండల ప్రాంతాలలో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములలో చేతికొచ్చిన పంటని ధ్వంసం చేస్తూ తిరిగి ఆదివాసీలపై కేసులు నమోదు చేస్తున్నారని బెదిరింపులకు గురి చేస్తున్నారని జాతి వివక్షతతో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.పత్తి చేలు మొత్తం పిందె పడి కాయ దగ్గరికి వచ్చిందని నోటికి వచ్చిన పంటను గద్దె వచ్చి తనుకుపోయే విధంగా ఫారెస్ట్ వారు వచ్చి నాశనం చేశారని వారు అన్నారు. ఫారెస్ట్ అధికారుల కండ ముందే సర్వేలు చేసి హద్దులు పెట్టుకొని భూములు సాగు చేసుకుంటుంటే ఈరోజు ఫారెస్ట్ అధికారులు అక్రమంగా పంటలను ధ్వంసం చేస్తున్నారని వారన్నారు జూలూరుపాడు మండలం ఎలకలోడ్డు గ్రామానికి చెందిన మడిమే హిడ్మ 30 గుంటల భూమిని మొత్తం సర్వనాశనం చేశారని పాల్వంచ మండలం బంజర, చిరుతంపాడు, పడగొని గూడెం, భూమిని చర్ల దుమ్ముగూడెంలో రెండు వందల ఎకరాల భూములలో పంటలను మొత్తం సర్వనాశనం చేశారని, పైగా ఏడుగురు మహిళలపై కేసులు నమోదు చేశారని ఈ దురంకార చర్యలు మానుకోవాలని వారన్నారు. అటవీ హక్కుల చట్టం, పిసా తీర్మానాలను ఉల్లంఘిస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పంట నష్టం పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జాతి వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్న ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేసి విధుల నుంచి తొలగించాలని వారు అన్నారు. రైతులు ఫారెస్ట్ వారి కళ్ళముందే సాగు చేసుకుని అప్పులు చేసి ఆలి పుస్తకాలు అమ్ముకొని విత్తనాలు తీసుకొచ్చుకొని పంట వేసే వరకు ఏమి మాట్లాడకుండా ఇప్పుడు పంట చేతికి వచ్చినాక జంక్షన్ చేయడం అంటే రైతులను మానసికంగా చంపడమేనని ఫారెస్ట్ వాళ్ళ కళ్ళముందే పంటలు వేసుకుంటుంటే అడ్డుచెప్పని ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు ఎందుకు పంటలను ధ్వంసం చేస్తున్నారో సమాధానం చెప్పాలని వారు అన్నారు.ఈ చర్యలను ఫారెస్ట్ వారు ఆపకపోతే న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజాపోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు సత్యమ్మ, సారమ్మ, ముత్తమ్మ, లింగయ్య, నాగయ్య, కొమరయ్య, అనిల్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :