తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం.డివిజన్ కమిటీ నియామకం. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేద్దాం .టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు డివిజన్ కమిటీలను ఎన్నుకునే దానిలో భాగంగా 23వ డివిజన్ నందు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2029 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ , కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను , ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమం,అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ , పార్టీ పటిష్ట నిర్మాణం కొరకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, కమిటీ సభ్యులు క్రమశిక్షణతో మెలుగుతూ పార్టీ పురోభివృద్ధికి కృషి చేయాలని ఆయన వారికి సూచించారు . ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, 28వ డివిజన్ కార్పొరేటర్ శ్రీలక్ష్మీ, 25వ డివిజన్ కార్పొరేటర్ కే కే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆళ్ల మురళి, చింతలపూడి రాజశేఖర్, బత్తుల వీరయ్య మరియు 23వ డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ