తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రం లోని శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్. రాందాస్ నాయక్ మాట్లాడుతూ ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైరా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పార్టీ ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, బుర్ర రాజశేఖర్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ