తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న నూతన సంవత్సరం జిల్లా ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమృద్ధి తీసుకురావాలని, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తనను కలెక్టర్ కార్యాలయానికి కలిసేందుకు వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు బొకేలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకొని రావద్దని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా బొకేలు, శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలపడం సహజమేనని, అయితే వాటికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, తదితర అవసరమైన సామగ్రిని అందించాలని ఆయన సూచించారు. ఈ విధంగా అందించే సామగ్రి పేద విద్యార్థుల చదువుకు ఎంతగానో ఉపయోగపడుతుందని,సేకరించిన విద్యా సామగ్రిని త్వరలో అర్హులైన విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ