తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా జిఎం కార్యాలయ ఆవరణ లో తేదీ 05-06-2025 (గురువారం) న ఉదయం. 9.30 గంటలకు “ప్రపంచ పర్యావరణ దినోత్సవ” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కొత్తగూడెం ఏరియా జిఎం షాలేం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జిఎం మాట్లాడుతూ …“ ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని ముగింపు పలుకుదాం ” అనే నినాదం తో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నం అని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అలాగే సింగరేణి సంస్థ వనమహోత్సవం కార్యక్రమం ద్వారా అనేక మొక్కలను నాటడం జరుగుతుందని తద్వారా వాతావరణ కాలుష్యాని తగ్గించి, వాతావరణం సమతుల్యానికి తోడ్పాటు కలుగుతుందని తెలియజేశారు. ప్రతి ఉద్యోగి తమ వ్యక్తిగత కర్తవ్యం గా తప్పక మొక్కలను నాటాలని, నాటిన మొక్కలకు కావాల్సిన పరిరక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందు తరాలు ఈ కాలుష్యం మరియు భూతాపం నుండి ఉపశమనం పొందాలంటే పర్యావరణాన్ని రక్షించాలని తెలియజేశారు. చుక్క – చుక్క కలిస్తే నే సముద్రం ఔతుందని ప్రతిఒక్కరు తమ భాద్యత గా భావించి పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడే మన భావి తరాల వారు క్షేమంగా ఉండగలరని దానికి అందరూ సహకరించాలని ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ