తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జేబీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ జన్మదినం సందర్భంగా,ఏప్రిల్ 27న వారి నివాసంలో జరగవలసిన జన్మదిన వేడుకలను,జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దాడుల నేపథ్యంలో,దేశభక్తి భావనతో మరియు బాధిత కుటుంబాల పట్ల గౌరవప్రదమైన సానుభూతితో,రద్దు చేయడమైనది. దేశం పట్ల గల ప్రేమను,బాధితుల పట్ల మద్దతును చాటే విధంగా ఈనిర్ణయం తీసుకున్నది.ఈసందర్భంగా కార్యకర్తలు,అభిమానులు,మిత్రులు ఈ విషయాన్ని గమనించి,జన్మదిన వేడుకలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని మనవి చేస్తున్నాము. జాతీయ సమైక్యతకు,శాంతికి మద్దతుగా జేబీపీ అంకితభావంతో నిలుస్తుంది.
Admin
తెలుగు వెలుగు టీవీ