Sunday, 19 April 2026 03:10:46 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ఘనంగా కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవం పాల్గొన్న పాలక మండలి సభ్యులు, త్రివేణి - కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీశ్

Date : 09 July 2025 09:04 AM Views : 710

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కొత్తగూడెం జులై 8: కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం సోమవారం ఉదయం యూనివర్సిటీ లో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరయ్యారు. పి హెచ్ డి అవార్డులు పొందిన అభ్యర్థులకు డాక్టరేట్ పట్టాలు, వివిధ కోర్సుల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన వారికి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులతో సమావేశం అయ్యారు. పాలక మండలి సభ్యులతో గవర్నర్ గ్రూప్ ఫోటో దిగారు. కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులుగా ఉన్న కొత్తగూడెం లోని త్రివేణి - కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్, కృష్ణవేణి డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గొల్లపూడి జగదీశ్ కూడా గవర్నర్ తో పాటు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యా రంగంలో సుధీర్ఘ అనుభవం ఉన్న జగదీశ్ కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులుగా ఉంటూ యూనివర్సిటీ కి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో పాలక మండలి సభ్యులతో పాలు పంచుకుంటున్నారు. సోమవారం నాటి పాలక మండలి సమావేశంలో గవర్నర్ తో పాల్గొనే అవకాశం రావడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా కు చెందిన పలువురు విద్యాభిమానులు గొల్లపూడి జగదీశ్ కి అభినందనలు తెలియజేశారు. విద్యా రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉండాలనే ఉద్దేశ్యంతోనే తన సలహా సూచనలు ఉంటాయని ఈ సందర్భంగా జగదీశ్ అన్నారు. ఈ స్నాతకోత్సవంలో కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె. ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా త్రివేణి - కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్లు మాచవరపు కోటేశ్వరరావు, గొల్లపూడి వీరేంద్ర చౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు జగదీశ్ కి అభినందనలు తెలియజేశారు. మున్ముందు మరిన్నో ఉన్నత పదవులను అలంకరించి విద్యా రంగంలో తన సేవలను ఉపయోగించాలని ఆకాంక్షించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :