తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కొత్తగూడెం జులై 8: కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం సోమవారం ఉదయం యూనివర్సిటీ లో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరయ్యారు. పి హెచ్ డి అవార్డులు పొందిన అభ్యర్థులకు డాక్టరేట్ పట్టాలు, వివిధ కోర్సుల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన వారికి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులతో సమావేశం అయ్యారు. పాలక మండలి సభ్యులతో గవర్నర్ గ్రూప్ ఫోటో దిగారు. కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులుగా ఉన్న కొత్తగూడెం లోని త్రివేణి - కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్, కృష్ణవేణి డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గొల్లపూడి జగదీశ్ కూడా గవర్నర్ తో పాటు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యా రంగంలో సుధీర్ఘ అనుభవం ఉన్న జగదీశ్ కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులుగా ఉంటూ యూనివర్సిటీ కి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో పాలక మండలి సభ్యులతో పాలు పంచుకుంటున్నారు. సోమవారం నాటి పాలక మండలి సమావేశంలో గవర్నర్ తో పాల్గొనే అవకాశం రావడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా కు చెందిన పలువురు విద్యాభిమానులు గొల్లపూడి జగదీశ్ కి అభినందనలు తెలియజేశారు. విద్యా రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉండాలనే ఉద్దేశ్యంతోనే తన సలహా సూచనలు ఉంటాయని ఈ సందర్భంగా జగదీశ్ అన్నారు. ఈ స్నాతకోత్సవంలో కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె. ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా త్రివేణి - కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్లు మాచవరపు కోటేశ్వరరావు, గొల్లపూడి వీరేంద్ర చౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు జగదీశ్ కి అభినందనలు తెలియజేశారు. మున్ముందు మరిన్నో ఉన్నత పదవులను అలంకరించి విద్యా రంగంలో తన సేవలను ఉపయోగించాలని ఆకాంక్షించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ