తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జనవరి 31 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఐదు సంవత్సరములు పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాదులో సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి ఆర్ఎస్ పార్టీ రథసారథి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీకి పార్టీ నియమ నిబంధనలు పాటిస్తూ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో మంచి రోజులు రానున్నాయని పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసిన కేటీఆర్ ఈ సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో అవిశ్వాస తీర్మానాలు పెట్టి అధికారాలను కైవసం చేసుకున్నారు. కానీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అవిశ్వాసం పెట్టినప్పటికీ మరలా గెలుపొంది తన సత్తా చాటుకున్నారని అటువంటి నాయకురాలు బిఆర్ఎస్ పార్టీకి ఎంతైనా అవసరం ఉన్నదని వారికి ముందు రోజులలో మంచి భవిష్యత్తు ఉన్నదని వారు అన్నారు.
ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిని శాలువాతో మెమొండతో సన్మానించిన బిఆర్ఎస్ రథసారథి కేటీఆర్. అనంతరం కాపు సీతాలక్ష్మి కాపు కృష్ణ కుమారుడు జినీత్ ఈశ్వరీల వివాహానికి రాలేకపోయినందున వారి ఇరువురి దంపతులను ఆశీర్వదించి సన్మానం చేసిన కేటీఆర్. ఈ సందర్భంగా అత్తా కోడల్ని శాలువాతో సన్మానించి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన కేటీఆర్. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ ఐదు సంవత్సరములు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పార్టీ అండదండలతో ముందుకు కొనసాగామని బిఆర్ఎస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమైందని వందల కోట్ల రూపాయలతో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనలతో కొత్తగూడెంను అభివృద్ధి చేశామని ఐదు సంవత్సరాలు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసిన మాజీ చైర్పర్సన్ బిఆర్ఎస్ నాయకురాలు కాపు సీతాలక్ష్మి. ఈ కార్యక్రమంలో కాపు సీతాలక్ష్మి కుటుంబ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ