తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం గణేష్ బస్తీకి చెందిన కేతేపల్లి సుధాకర్ అను వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడు షేక్ భాషాకు జీవిత ఖైదును విధిస్తూ కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పును వెలువరించారు.2021 సెప్టెంబర్ 9వ తేదీన మృతుడి సోదరుడైన కేతేపల్లి సురేష్ ఫిర్యాదు మేరకు అప్పటి లక్ష్మీదేవిపల్లి స్టేషన్ హౌస్ అధికారి అంజయ్య కేసు నమోదు చేయడం జరిగింది.విచారణాధికారిగా అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గురుస్వామి దర్యాప్తు చేపట్టగా మృతుడు కేతేపల్లి సుధాకర్ ను అప్పుగా డబ్బులు అడిగినందుకు అతను నిరాకరించిగా,అట్టి విషయాన్ని మనసులో పెట్టుకొని లక్ష్మీదేవి పల్లి మండలం చేత కొండకు చెందిన షేక్ భాషా పథకం ప్రకారం సుధాకర్ ను ఎదురుగడ్డలోని చిప్ప ముత్తులింగం జామాయిల్ తోటలోనికి తీసుకెళ్లి ఒక ఇనుప రాడ్డుతో తలపై గట్టిగా మోది అతడిని హత్య చేసి మెడలో ఉన్న బంగారు గొలుసును,చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని అపహారించి పారిపాయాడని విచారణలో తేలింది.ఫోన్ కాల్ రికార్డు ద్వారా షేక్ భాషాను నిందితుడిగా గుర్తించి సిఐ గురుస్వామి కోర్టులో ఛార్జి షీట్ దాఖలు చేశారు.ఇట్టి కేసులో 16 మంది సాక్షులను విచారించిన పిదప నిందితుడికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసు విషయంలో నిందితుడికి శిక్ష పడేవిధంగా కృషి చేసి బాధితు కుటుంబానికి న్యాయం చేకూరేలా భాద్యతగా వ్యవహరించిన పోలీసు అధికారులు సీఐ గురుస్వామి,ఎస్సై రమణారెడ్డి,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పివిడి లక్ష్మి,కోర్ట్ నోడల్ అధికారి రాఘవయ్య,లైజన్ అధికారి వీరబాబు,కోర్ట్ డ్యూటీ అధికారి అశోక్ లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించ
Admin
తెలుగు వెలుగు టీవీ