తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 13 తెలుగు వెలుగు) :కొత్తగూడెం, చుంచుపల్లి మండలం, బాబుక్యాంపులో గల పల్లె దవాఖానలో గురువారం ఉదయం టీబీ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు, టీబీ సంబంధిత అధికారులు, బాబుక్యాంప్ ఎక్స్ ఉప సర్పంచ్ పోలమూరు శ్రీనివాస్, బాబుక్యాంపు యూత్ జల్లి రాజేష్, బంటి, చిన్నూ, వినీత్, శ్యామ్, నాగేందర్, తేజ, నిఖిల్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ మీకు టీబీ లక్షణాలు ఏమున్నా సరే పల్లెదవాఖానకు వచ్చి ఉచిత పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ