తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు డిగ్రీ కళాశాలలో మహాత్మా జ్యోతిబా పూలే 199 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జీతీష్ వి పాటిల్, ఐటీడీఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ తో కలిసి పూలే చిత్ర పటానికి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు సామాజిక దార్శనికుడిగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన మహనీయుడు ఫూలే అన్నారు. వివక్ష లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబా ఫూలే అని కొనియాడారు. పూలే ఆశయాలు, ఆశలకు అనుగుణంగా సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అభ్యున్నతి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా దశాబ్దాలుగా ప్రజల న్యాయబద్ధ డిమాండ్ లైన బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో TPCC సభ్యులు చందా.సంతోష్, చక్రవర్తి, ఓబీసీ పట్టణ అధ్యక్షులు జయప్రకాశ్, బొబ్బల వెంకట్ యాదవ్ మరియు బీసీ నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ