Monday, 20 April 2026 01:41:52 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

జిల్లాస్థాయి ఆసుపత్రుల ప్రగతి పై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 03 March 2025 06:56 PM Views : 1167

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా వైద్య విధాన పరిషత్ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లాలోని ఆసుపత్రుల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల లో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, స్కానింగ్, రక్త పరీక్షలు, సర్జరీలు డయాలసిస్ మరియు డెలివరీ లపై ఆస్పత్రులు వారీగా ప్రగతిపై ఆసుపత్రుల సూపర్డెంట్ లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ఆసుపత్రులలో పారిశుధ్యం కొరకు అధునాతన యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఆసుపత్రులలో ఈ ఎన్ టీ వైద్యం కోసం కావలసిన యంత్ర పరికరాలకు సంబంధించి నివేదికలు అందించాలన్నారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వర్షాకాలంలో ఆసుపత్రుల్లో ఎక్కడైనా లీకేజీ, త్రాగునీటి సమస్య వంటి వాటిని గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో అవసరమైన వైద్యులు మరియు సిబ్బందిని నియామకానికి తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని ఆసుపత్రిలో అభివృద్ధి కొరకు సింగరేణి, ఐ టి సి, కేటీపీఎస్ యు నవభారత్ వంటి పరిశ్రమలు ముందుకొస్తున్నాయని, దానికి తగిన విధంగా సరైన ప్రణాళికలు రూపొందించాలని సూపర్డెంట్ లను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు మరియు సిబ్బంది సమయపాలన పాటించి, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు.సిబ్బంది హాజరు పై ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు . నర్సింగ్ సూపర్డెంట్లు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సిబ్బందికి డ్యూటీలు వేయాలని అన్నారు. ఆసుపత్రులలో సరిపడా మందులు లేవంటే ఆసుపత్రి ఫార్మసిస్టులు దే బాధ్యత అని అన్నారు. అవసరమైన మందులకు ఎప్పటికప్పుడు ఇండెంట్లు పంపించాలని సూచించారు.ఇండెంట్లు పెట్టిన మందులు రాకపోతే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంచి డెలివరీ ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా చర్యలు చేపట్టాలి.ప్రభుత్వ ఆసుపత్రి కివచ్చే పేద రోగుల కు అందించే వైద్య సేవలలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సందర్బంగా అన్ని విభాగలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ సమావేశంలో డిసిహెచ్ఓ రవిబాబు, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపడెంట్ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :