తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 29 తెలుగు వెలుగు)జూలూరుపాడు లో శాశ్వత వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు చేయాలనీ పనులను వెంటనే ప్రారంభించలని కోరుతూ జూలూరుపాడు. రైతు. ప్రజాసంఘాల గిరిజన సంగంజేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక శాసన సభ్యులు రాందాస్ నాయక్ కు వైరా లోని తన గృహంలో వినతి పత్రం అందిచడం జరిగింది అదేవిదంగా ఐ టి డి ఏ ఏ పి ఓ డేవిడ్ రాజ్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్బంగా ఈ మండలం లో అత్యధికముగా పత్తి పంటను సాగుచేస్తున్నారు అని అన్నారు దూర ప్రాంతాలకు వెళ్లి అమ్మాలి అంటే కొంత వ్యయ ప్రయాసలతో, ఖర్చు లతో కూడుకున్నాదని సమయం కూడా వేచించాల్సిన పరిస్థితి ఉన్నదని దీని వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కాబట్టి అన్ని విధాలుగా రైతులకు ఉపయోగం గా అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్ గా ఉన్నదని అన్నారు ఇక్కడికి వివిధ రాష్ట్రము లనుండి పత్తి కొనుగోలు చేయడం కోసం వ్యాపార వేత్తలు రావడంతో రైతులకు కూడా మేలు జరుగుతుంది అని mla కు వివరించటం జరిగింది ఈ సందర్బంగా mla మాట్లాడుతూ త్వరలోనే మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో జేఏసీ నాయకులు భానోత్ ధర్మ, గుగులోత్ కేశవ నాయక్, లకావత్ నాగేశ్వరావు, జాటోత్ కృష్ణ భానోత్ మధు, భూక్యా శివ, భూక్యా శంకర్, హమాలీ మేస్త్రి లు గత్తం బాబురావు పప్ప ల, జానూ, ఇల్లంగి సుందర్ రావు, పోతురాజు బోడయ్య, నరసింహారావు, వల్ల మల్ల చంద్రయ్య, ప్రతాప్, కాంగ్రెస్ నాయకులు లేళ్ళ వెంకట్ రెడ్డి, రామిశెట్టి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ