తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామంలో బుధవారం రాత్రి ఓ ఇంట్లోకి నాగుపాము దూరి కలకలం సృష్టించింది. సింగరేణి ఉద్యోగి భాస్కర్ నివాసంలో రాత్రి 9:30 సమయంలో వంటింట్లోకి పాము రావడంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన భాస్కర్ స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్కు సమాచారం అందించగా, ఆయన సురక్షితంగా పట్టుకున్నారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించేవారు రాత్రిపూట జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ