తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : “YERU – The River Festival” లో భాగంగా రేపు (శనివారం) సాయంత్రం 4 గంటల నుండి భద్రాచలం తెప్పోత్సవ ఘాట్ వద్ద ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం మరియు నది హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జితేష్ వి. పాటిల్, జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సుమారు 230 మంది లోకల్ యువత పాల్గొనే ఫ్లాష్ మోబ్ పెర్ఫార్మెన్స్ (Flash Mob Performance) (ఒకేసారి నృత్యం) ప్రధాన ఆకర్షణగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. యువత సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు, నదుల పట్ల అవగాహనను పెంపొందించే విధంగా ఈ ప్రదర్శనలు రూపొందించబడ్డాయని తెలిపారు. ఫ్లాష్ మోబ్ పెర్ఫార్మెన్స్ అనంతరం నది హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నదుల సంరక్షణ, ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం కలిగించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యమని ఆయన వివరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ