తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అశ్వారావుపేట మండలం వినాయకపురం లో ఉన్న పిల్లల ఆశ్రమాన్ని సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగ న్యాయమూర్తి పిల్లలకు అందిస్తున్న కనీస సౌకర్యాల గురించి ఆశ్రమ నిర్వహకుడు ను అడిగి తెలుసుకున్నారు.పిల్లల సంరక్షణ కష్టంగ ఉండడం వలన వచ్చిన పిల్లలకు సంరక్షణ, విద్య, ఆహారం తదితర అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగ తెలిపారు. ఈ సందర్బంగా న్యాయమూర్తి రిజిస్టర్ లు ఆశ్రమం ఆవరణ, కిచెన్ రూమ్, స్టోర్ రూమ్, సౌచలయాలు ను పరిశీలించారు. ఆశ్రమంను సజావుగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, అశ్వారావుపేట ఎస్.ఐ రామ్మూర్తి పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ