తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులకు సువర్ణ అవకాశం. జిల్లాలోని రైతులకు ఆధునిక, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బయోచార్ నిపుణులు పరశురాం కైలాస్ అఖరే గారి ఆధ్వర్యంలో బయోచార్పై ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం రెండు రోజుల పాటు నిర్వహించబడనుండగా, మొదటి రోజు HNTC, గరిమెళ్ళపాడు లో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రెండో రోజు శిక్షణ కార్యక్రమం రేపు (07-01-2026) బుధవారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అగ్రికల్చర్ కాలేజ్, అశ్వరావుపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో బయోచార్ తయారీ విధానం, దాని ప్రయోజనాలు, మట్టిసారాన్ని పెంపొందించడంలో బయోచార్ పాత్ర, రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం, పంట దిగుబడులు పెంచడం వంటి అంశాలపై రైతులకు ప్రత్యక్షంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. బయోచార్ వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. జిల్లాలోని రైతులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. శిక్షణకు సంబంధించిన వివరాలు మరియు లొకేషన్ సమాచారం కోసం క్రింది వారిని సంప్రదించవచ్చని తెలిపారు. శిక్షణ వివరాలకు సంప్రదించవలసిన వారు : రాజు – 92814 79565 (DRDO కార్యాలయం) డా. నాగ అంజలి – 94927 31222 అగ్రికల్చర్ కాలేజ్, అశ్వరావుపేట
Admin
తెలుగు వెలుగు టీవీ