Saturday, 18 April 2026 02:42:38 AM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

69వ అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలు, చివరి దశకు సెమీఫైనల్‌కు అర్హత సాధించిన జట్లు.

Date : 10 January 2026 08:50 PM Views : 307

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం గ్రామంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 69వ అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. శనివారం నిర్వహించిన ఫ్రీ క్వార్టర్ ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ ఉత్కంఠభరితంగా సాగగా, విజయం సాధించిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. శనివారం జరిగిన ఫ్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచుల్లో విద్యా భారతి జట్టుపై పంజాబ్ జట్టు 57–56తో విజయం సాధించింది. రెండో మ్యాచులో కేరళపై తెలంగాణ జట్టు 62–44తో గెలుపొందింది. మూడో మ్యాచులో ఆంధ్రప్రదేశ్‌పై ఉత్తరప్రదేశ్ జట్టు 70–44తో విజయం సాధించింది. నాలుగో మ్యాచులో గుజరాత్‌పై పుదుచ్చేరి జట్టు 49–44తో గెలిచింది. ఐదో మ్యాచులో మణిపూర్‌పై రాజస్థాన్ జట్టు 55–37తో విజయం సాధించింది. ఆరో మ్యాచులో సీబీఎస్‌ఈపై కర్ణాటక జట్టు 63–44తో గెలుపొందింది. ఏడో మ్యాచులో మధ్యప్రదేశ్‌పై హర్యానా జట్టు 67–33తో విజయం సాధించింది. ఎనిమిదో మ్యాచులో మహారాష్ట్రపై తమిళనాడు జట్టు 53–40తో గెలిచింది.మధ్యాహ్నం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచుల్లో పంజాబ్‌పై తెలంగాణ జట్టు 68–46తో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. పుదుచ్చేరిపై ఉత్తరప్రదేశ్ జట్టు 69–45తో గెలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. తమిళనాడు‌పై హర్యానా జట్టు 51–50తో స్వల్ప తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది.ఆదివారం సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :