తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : రాజకీయ పలుకుబడితో ఉత్పత్తినే లక్ష్యంగా పెట్టుకొని కార్మికుల రక్షణను గాలికి వదిలేసిన వీకే కోల్ మైన్ సౌధ ఆఫ్ లోడింగ్ కంపెనీ కార్మిక చట్టాలకు తూట్లుపొడుస్తున్న సౌధ కంపెనీ పై మండిపడ్డ గుర్తింపు సంఘం ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి- వి.మల్లికార్జున్ రావు బుధవారం ఉదయం 9:30 గంటలకు మొదటి షిఫ్ట్ లో కాలంచెల్లిన,ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేని పోత లోడర్ పై గంప.అచ్చయ్య(35) అనే డ్రైవర్ లోడ్ తో వస్తుండగా అదుపుతప్పి పల్టీ పడింది దాంతో డ్రైవర్ కి తీవ్రగాయాలయ్యాయి,గాయాలపాలైన కాంట్రాక్ట్ కార్మికుడికి ఆక్సిడెంట్ రిపోర్ట్ రాయకుండా,సింగరేణి ఆసుపత్రిలో వైద్యం అందించకుండా ప్రవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించడంతో సౌధ కంపెనీ పై తీవ్రస్థాయిలో ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు మండిపడ్డారు,రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని కనీస రక్షణసూత్రాలు పాటించకుండా ఉత్పత్తిని ద్యేయంగా పెట్టుకొని కార్మికుల ప్రాణాలతో సౌధ ఆఫ్ లోడింగ్ కంపెనీ చలగటం ఆడుతుందనీ అన్నారు, వీకే కోల్ మైన్ ఆఫ్ లోడింగ్ క్వారీలో అదుపుతప్పి బోల్తాపడిన లోడర్ నెంబర్-11 కాలం చెల్లిన పాతది అని,ఆ లోడర్ కి ఎలాంటి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు అని,కనీసం నంబర్ ప్లేట్ కూడా లేదని తెలిపారు,సింగరేణి లో కాంట్రాక్ట్ కార్మికుడు విధులు నిర్వహించాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి వాటిని సైతం బేకరతుచేస్తూ సౌధ ఆఫ్ లోడింగ్ కంపెనీనీ సదరు కాంట్రాక్టర్ నడుపుతున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు,సౌధ ఆఫ్ లోడింగ్ కంపెనీ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి ఆసుపత్రి నుండి మెడికల్ ఫీట్ సర్టిఫికెట్,మరియు సింగరేణి వీటిసి నందు శిక్షణపొంది అర్హతకలిగిన సర్టిఫికెట్ పొంది క్వారీ లో విధులు నిర్వహించాల్సింటుంది అవి ఏమి లేకుండా రాజకీయ పలుకుబడితో ఇష్టారాజ్యంగా సౌధ ఆఫ్ లోడింగ్ కంపెనీ నడిపిస్తుంది అని అన్నారు,అదేవిధంగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డ కాంట్రాక్ట్ కార్మికుడు అచ్చయ్య కి క్వారీ లో విధులు నిర్వహించడానికి ఎలాంటి అర్హత కలిగిన సర్టిఫికెట్స్ లేవని అందుకే ప్రవేట్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారని మండిపడ్డారు,ఇప్పటికైనా డిజిఎంఎస్ స్థాయి అధికారి జరిగిన ప్రమాదంపై అలాగే కార్మిక చట్టాలకు తూట్లుపొడుస్తున్న ఇలాంటి సౌధ ఆఫ్ లోడింగ్ కంపెనీ పై ఒకసారి విచారణ జరిపి చర్యలు తీసుకోనీ కార్మికుల ప్రాణాలను కాపాడాలని గుర్తింపు సంఘం ఎఐటియుసి డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ