Monday, 20 April 2026 01:37:36 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

పిల్లల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య అందించాలి. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 22 October 2025 07:05 PM Views : 307

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భవిత కేంద్రాలు పిల్లల మానసిక, శారీరక వికాసానికి బలమైన వేదికలు కావాలి – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం కొత్తగూడెం బాబు క్యాంపు ప్రాంతంలో ఉన్న పీఎం శ్రీ ప్రభుత్వ హై స్కూల్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు భవిత కేంద్రాన్ని సందర్శించి పలు అంశాలను సమీక్షించారు.కలెక్టర్ మొదట పీఎం శ్రీ ప్రభుత్వ హై స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించి, తరగతులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధనా విధానాలు, పాఠశాలలో లభ్యమవుతున్న సౌకర్యాలు, డిజిటల్ క్లాస్ రూమ్‌ల వినియోగం, స్మార్ట్ బోర్డుల ద్వారా పాఠ్యాంశ బోధన విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి, వారు నేర్చుకుంటున్న విషయాలు, తమ భవిష్యత్తు లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. పదవ తరగతి గదిలోకి వెళ్లి ఆ సమయంలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టీవీలను ఉపయోగిస్తున్నారా వీటి ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరు ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఖాన్ అకాడమీలో విద్యార్థులను రిజిస్టర్ చేశారని ప్రధానోపాధ్యాయులు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ – పీఎం శ్రీ పథకం కింద ప్రతి పాఠశాలను ఉత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని,ఈ పాఠశాలలు భవిష్యత్తులో దేశానికి మార్గదర్శకులుగా నిలిచే విద్యార్థులను తయారు చేయాలి అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందించేలా బోధన విధానాలను అవలంబించాలి, అని సూచించారు.అలాగే పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మైక్రో లెర్నింగ్ కార్యక్రమాలు, సైన్స్ ప్రాజెక్టులు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికితీయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలల్లో పోషకాహార మెనూ, మిడ్‌డే మీల్ నాణ్యత, పిల్లల ఆరోగ్య రికార్డులు కూడా పరిశీలించారు.అనంతరం కలెక్టర్ బాబు క్యాంపులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, ఆటలు, శ్రద్ధల గురించి తెలుసుకున్నారు. చిన్న పిల్లలలో పాఠశాలపై ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు సృజనాత్మక పద్ధతులు ఉపయోగించాలని సూచించారు. ప్రాథమిక స్థాయి విద్యనే పిల్లల భవిష్యత్తుకు పునాది అన్నారు. అందుకే ఈ దశలో విలువాధారిత విద్య అత్యంత ముఖ్యం అని ఆయన తెలిపారు.తరువాత ఆయన భవిత కేంద్రం ను సందర్శించి, అక్కడ జరుగుతున్న పిల్లల సంపూర్ణ అభివృద్ధి కార్యక్రమాలు, తల్లిదండ్రుల అవగాహన సమావేశాలు, శిశు సంరక్షణ పథకాలు గురించి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరీక్షలు, బరువు కొలతలు, పోషకాహార పంపిణీ తదితర అంశాలను సమీక్షించారు. భవిత కేంద్రం ద్వారా తల్లి-శిశు ఆరోగ్య పరిరక్షణ, పిల్లలలో మానసిక-శారీరక వికాసం సాధించడానికి ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలు కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయురాలు నీరజ, బోధన మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :