Monday, 20 April 2026 01:35:23 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకం : జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్

Date : 08 December 2025 06:56 PM Views : 126

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించడంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. మూడువిడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే మైక్రో అబ్జర్వర్లు తమ తమ పోలింగ్ స్టేషన్లకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు. పోలింగ్ ప్రారంభానికి ముందు, పోలింగ్ సమయంలో, పోలింగ్ ముగిసిన తరువాత ప్రతి దశలోనూ సూక్ష్మంగా పరిశీలించి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో జరిగే ప్రతి అంశాన్ని నిశితంగా గమనించి, ఎన్నికల నియమావళి ఖచ్చితంగా అమలవుతున్నదేనా అనే విషయాన్ని అంచనా వేసి తగిన నివేదికను సాధారణ పరిశీలకులకు సమర్పించాలని శ్రీరామ్ ఆదేశించారు. ఎలాంటి అనుచిత చర్యలు, నిబంధనల ఉల్లంఘనలు గమనించిన వెంటనే సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో స్వేచ్ఛా, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల నిర్వహణకు సూక్ష్మ పరిశీలకుల సేవలు అత్యంత ముఖ్యమైనవని ఈ సందర్భంగా నోడల్ అధికారి హితవు పలికారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి సాయి కృష్ణ, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :