తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపుమేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనలతో సోమవారం కొత్తగూడెం ప్రగతి మైదానంలోని అమరవీరుల స్థూపం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం సీతాలక్ష్మి మాట్లాడారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పేరుతో గత ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ బురదజల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై అసెంబ్లీలో చర్చకు పిలిచి మాజీ మంత్రి హరీష్ రావు సమాధానాలను పదేపదే అడ్డుకున్నారని తెలిపారు. ఘోష్ కమీషన్ నివేదిక వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, అది కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా సిద్ధం చేసుకున్న నివేదిక అని మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం తొలి తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. తెలంగాణ కరువు ప్రాంతానికి నీరు అందించిన అపర భగీరథుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. అలాంటి అపర భగీరథుడిని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ప్రాజెక్టుపై కనీస పరిజ్ఞానం లేని మంత్రులు అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తూ.. సభాకాలాన్ని వృధా చేసి సభను తప్పుదోవ పట్టించారని స్పష్టం చేశారు. రూ. 87 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అనడం వారి అజ్ఞానానికి నిదర్శనమని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ప్రసాద్, తొగరు రాజశేఖర్, మునీర్, మాధవి, రామిళ్ళ మధు, పూర్ణచందర్ నాయక్, హనుమంతరావు, పోతురాజు రవి, రాజమౌళి, సాంబశివరావు, బి కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, షారుక్, రిజ్వాన్, యాకూబ్ పాషా, రెహమత్, ఆర్ శ్రీనివాస్, షణ్ముఖ సాయి, కాపు నవనీత్, హాసిఫ్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ