Friday, 17 April 2026 06:30:22 PM
# సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్.

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొంతు నొక్కారు: కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

Date : 01 September 2025 06:08 PM Views : 480

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపుమేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనలతో సోమవారం కొత్తగూడెం ప్రగతి మైదానంలోని అమరవీరుల స్థూపం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం సీతాలక్ష్మి మాట్లాడారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పేరుతో గత ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ బురదజల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై అసెంబ్లీలో చర్చకు పిలిచి మాజీ మంత్రి హరీష్ రావు సమాధానాలను పదేపదే అడ్డుకున్నారని తెలిపారు. ఘోష్ కమీషన్ నివేదిక వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, అది కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా సిద్ధం చేసుకున్న నివేదిక అని మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం తొలి తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. తెలంగాణ కరువు ప్రాంతానికి నీరు అందించిన అపర భగీరథుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. అలాంటి అపర భగీరథుడిని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ప్రాజెక్టుపై కనీస పరిజ్ఞానం లేని మంత్రులు అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తూ.. సభాకాలాన్ని వృధా చేసి సభను తప్పుదోవ పట్టించారని స్పష్టం చేశారు. రూ. 87 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అనడం వారి అజ్ఞానానికి నిదర్శనమని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ప్రసాద్, తొగరు రాజశేఖర్, మునీర్, మాధవి, రామిళ్ళ మధు, పూర్ణచందర్ నాయక్, హనుమంతరావు, పోతురాజు రవి, రాజమౌళి, సాంబశివరావు, బి కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, షారుక్, రిజ్వాన్, యాకూబ్ పాషా, రెహమత్, ఆర్ శ్రీనివాస్, షణ్ముఖ సాయి, కాపు నవనీత్, హాసిఫ్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :