తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జూలూరుపాడు మండలం గుండేపూడి గ్రామ నివాసి మునగాల సాయి కిరణ్ కి 2023 సంవత్సరంలో బైక్ ప్రమాదంలో తలకి గాయం జరిగినది, తలకు ఆపరేషన్ జరిగిన తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఉద్యోగానికి కూడా హాజరు అవ్వలేదు అటువంటి పరిస్థితుల్లో అప్పటి అధ్యక్షులుగా ఉన్నటువంటి చారుగుళ్ల శ్రీనివాస్ ని సంప్రదించడం జరిగినది, వారు విధులలో చేరేవరకు ప్రతి నెల రూ 1,000 చొప్పున జీవితకాలం పెన్షన్ ఇస్తానని తెలియజేశారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ తాజా మాజీ అధ్యక్షులు ప్రతి నెల అందజేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం లో భాగంగా (31 వ) నెల ఆగష్టు 2025 పెన్షన్ రూ 1,000 జూలూరుపాడు మండల, పట్టణ అధ్యక్షులు ఉడతా వెంకటేశ్వర్లు, ఉడతా వేణు గోపాలరావు చేతుల మీదుగా తెలంగాణా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ ఉపాధ్యక్షులు వందనపు సత్యనారాయణ, తెలంగాణా రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం ఉపాధ్యక్షులు మహంకాళి గోపాలకృష్ణ సమక్షంలో అందజేశారు.ఈ కార్యక్రమం లో వేముల నాగేశ్వరరావు, చల్ల జనార్ధన్, వంకదారి వెంకటేశ్వరరావు , అన్నవరపు జస్వంత్, ఉడతా వినయ్ కుమార్, నుదురుపాటి ప్రేమ్ కిషోర్ తదితర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ