Wednesday, 27 May 2026 12:11:27 AM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

బాలికలు విద్యతో ముందుకు సాగాలి - సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 28 April 2026 03:55 PM Views : 111

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పిల్లల భద్రత వారోత్సవాల సందర్భంగా మండల స్థాయి సమీక్ష సమావేశం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం టేకులపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, బాలికలు విద్యపై పూర్తి దృష్టి సారించి తమ లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా క్రమశిక్షణతో ముందుకు సాగాలని, తమ భవిష్యత్తును సక్రమంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. వేసవి సెలవులను సృజనాత్మకంగా వినియోగిస్తూ సింగింగ్, పెయింటింగ్, డ్రాయింగ్ వంటి రంగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు పాటిస్తూ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, సమయాన్ని వృథా చేయకుండా కెరీర్ అభివృద్ధి, నైపుణ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండటం ప్రతి విద్యార్థికి అవసరమని అన్నారు . ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా కిషోర బాలికల కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో డ్రగ్స్ దుష్ప్రభావాలు, వ్యక్తిగత భద్రత, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై వివరించారు. ఈ దశలో బాలికలు శారీరక, మానసిక మార్పులను ఎదుర్కొంటారని, అందువల్ల వారికి తగిన మార్గదర్శకత్వం, పోషకాహారం, మానసిక మద్దతు అవసరమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతర పర్యవేక్షణ వహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బందికి మొబైల్ ఫోన్లు అందజేసి పోషణ ట్రాకింగ్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. సురక్షిత బాలికల సాధనలో భాగంగా విద్య, ఆరోగ్యం, రక్షణ అంశాలపై సమగ్ర దృష్టి అవసరమని, ప్రతి బాలికకు భద్రమైన వాతావరణం కల్పించడం సమాజ బాధ్యత అని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాల్యవివాహాల నివారణపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో “బాల్య వివాహం – బ్రతుకు ఆగం” గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం, బాల్యవివాహాలను చేసుకోబోమని, ప్రోత్సహించబోమని పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాల్యవివాహాల నిర్మూలనకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. సఖి వన్ స్టాప్ సెంటర్ మొబైల్ అవగాహన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి, ఆ కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలపై అవగాహన గోడపత్రికను ఆవిష్కరించారు. పిల్లల భద్రతకు సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే టోల్ ఫ్రీ నెంబర్ 1098 పోస్టర్‌ను కూడా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ నెంబర్ ద్వారా పిల్లలకు సంబంధించిన సమస్యలను వెంటనే అధికారులకు తెలియజేయవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ సేవను వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లేనినా, తాసిల్దారు వీరభద్రం, మండల స్థాయి అధికారులు, అంగన్వాడి సిబ్బంది, వైద్యశాఖ అధికారులు, కిశోర బాలికలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :