తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు, 03-12-2025న, జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్న IDOC సమావేశ మందిరంలో ప్రైవేటు ఆసుపత్రులు మరియు డయాగ్నస్టిక్ సెంటర్ల వైద్య సిబ్బందికి IHIP పోర్టల్ వినియోగంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ, IHIP పోర్టల్లో సిండ్రామిక్ సర్వైలెన్స్కు సంబంధించిన 22 సిండ్రోములు మరియు 33 వ్యాధుల వివరాలను ప్రతిరోజూ కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.సంబంధిత అన్ని ప్రైవేటు ఆరోగ్య సంస్థలు ఈ మార్గదర్శకాలను అచ్చం అమలు చేయాలనీ ఆదేశించారు.అలాగే Clinical Establishment Act, PCPNDT Act, MTP Actల అమలు విధానాలపై కూడా పూర్తి వివరాలు తెలియజేశారు. జిల్లాలో సిజేరియన్ శస్త్రచికిత్సల శాతం తగ్గించే చర్యలను తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ DM&HO డాక్టర్ జయలక్ష్మి, ప్రోగ్రాం ఆఫీసర్–IDSP డాక్టర్ పుల్లారెడ్డి, ఎపిడమాలజిస్ట్ ఇమ్మాన్యుయేల్, DDM–IDSP శ్రీను, AMO కుమారస్వామి, మరియు వివిధ ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ల వైద్య సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ