Wednesday, 15 April 2026 06:39:30 PM
# ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ – సీఎస్ రామకృష్ణ. # నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. # దిశాకమిటీ జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి,

Date : 29 September 2025 09:15 PM Views : 186

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్థానిక సంస్థలకు ఎన్నికలకు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా జిల్లా యంత్రాంగం, స్థానిక ఎన్నికల కోసం బాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాలు పూర్తిగా ఏర్పాటు,జిల్లాలో ఎంపీటీసీ, జడ్పిటిసి లకు 2 విడుతలలో, గ్రామపంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) ఐ. రాణి కుముదిని, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్, ఎన్నికల నిర్వహణ, మోడల్ ప్రవర్తనా నియమావళి అమలు, లా అండ్ ఆర్డర్ నిర్వహణ తదితర అంశాలపై ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్‌ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్‌ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) ఐ. రాణి కుముదిని మాట్లాడుతూ ....... తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఈ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించిందని ఎంపీటీసీ (మండల పరిషత్ టెర్మినల్ కమిటీ), జడ్పీటీసీ (జిల్లా పరిషత్ టెర్మినల్ కమిటీ), గ్రామ పంచాయతీ ఎన్నికలు మొత్తం ఐదు దశల్లో నిర్వహించనున్నారు. తొలి రెండు దశల్లో MPTC, ZPTC ఎన్నికలు, మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా, రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల నిర్వహణ, మోడల్ ప్రవర్తనా నియమావళి అమలు, లా అండ్ ఆర్డర్ పరిస్థితుల పర్యవేక్షణ వంటి అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరింపు, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలపై కలెక్టర్లు, పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పిటిసి, గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఎన్నికల నియమావళి అనుసరిస్తూ, MPTC, ZPTC ఎన్నికలు రెండు విడతలలో జరుగుతాయని వివరించారు. ఈ మేరకు బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సిబ్బంది నియామకం, మొదటి విడత శిక్షణ తరగతులు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు కూడా తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన అన్ని బాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం వంటి ఏర్పాట్లలో పూర్తిస్థాయిగా సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల అధికారికి వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, ఎలక్షన్ సూపర్డెంట్ రంగ ప్రసాద్ మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :