తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ పట్టణ పరిధి 40వ డివిజన్ లో లేడీస్ జిమ్ & జుంబా స్టూడియో ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత హాజరయ్యారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో అత్యాధునిక సదుపాయాలతో జిమ్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఓలంపిక్ అధ్యక్షులు యుగంధర్ రెడ్డి,ఉపాధ్యక్షులు వై వెంకటేశ్వర్లు,జిమ్ ట్రైనర్ సింధు,6వ డివిజన్ కార్పొరేటర్ బిఎస్ రావు,5వ డివిజన్ కార్పొరేటర్ నూకల సరిత,2వ డివిజన్ కార్పొరేటర్ భవిత కిరణ్,40వ డివిజన్ కార్పొరేటర్ సాయిబాబా,41వ డివిజన్ కార్పొరేటర్ అన్నపూర్ణ, 45వ డివిజన్ కార్పొరేటర్ దంతేబోయిన నరేష్, మాజీ పెద్దమ్మ తల్లి గుడి చైర్మన్ మహిపతి రామలింగం, యువజన కాంగ్రెస్ నాయకులు భరత్ మరియు పురప్రముఖులు,యువత,మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ