తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రేగళ్ల, మైలారం, బంగారు చెలక తదితర గ్రామాల రైతులకు లక్షలోపు రుణాలు మాఫీ కాలేదు. 300 మంది రైతులు రుణమాఫీ కాక ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా వారికి భరోసా కల్పించారు. బుధవారం రైతులతో కలిసి IOB బ్యాంకు అధికారులతో మాట్లాడారు. రైతు రుణమాఫీ సమస్యపై బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ