తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 12 తెలుగు వెలుగు )జూలూరుపాడు మండలంలో ఎరువులు పురుగుమందులు మరియు విత్తన డీలర్లకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వానాకాలం 2025 కు సంబంధించి డీలర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మండలంలో నకిలీ విత్తనములు పురుగుమందులు సరఫరా కాకుండా వారి వంతు బాధ్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏ డి ఏ యు నరసింహారావు మండల వ్యవసాయ అధికారి జి దీపక్ ఆనంద్ సిఐ ఇంద్రసేనారెడ్డి మరియు డీలర్స్ అసోసియేషన్ బాధ్యులు లేళ్ళ వెంకటరెడ్డి, మంగమూడి నాగేశ్వరరావు మరియు మండలంలో ఉన్నటువంటి డీలర్లు అందరూ హాజరు అయినారు. ఏ డి ఏ మాట్లాడుతూ డీలర్లు అందరూ తప్పనిసరిగా రైతులకు రసీదు ఇవ్వవలసిందిగా సూచించినారు, అలాగే వారు మెయింటైన్ చేయవలసిన రికార్డ్స్ అన్ని పకడ్బందీగా ఉండవలసిందిగా సూచించినారు. స్టాక్ బోర్డులో మరియు స్టాక్ రిజిస్టర్లు అన్నీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉండాలని తెలిపినారు. అలాగే సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ మండలంలో నకిలీ విత్తనాలు మరియు పురుగు మందుల గురించి సమాచారం ఉన్నట్లయితే తెలియజేస్తే వారిపై 420 కేస్ బుక్ చేసి అట్టి బాధ్యులను అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపినారు.
Admin
తెలుగు వెలుగు టీవీ